Trishul News

గొల్లపూడిలో ఉద్రిక్తత.. వివాదాస్పద స్థలం నుంచి టీడీపీ ఆఫీస్‌ తరలింపు..!

గొల్లపూడి, త్రిశూల్ న్యూస్ :
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. గొల్లపూడిలోని వివాదస్పద స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో..గురువారం ఉదయం అక్కడి నుంచి టీడీపీ కార్యాలయ తరలింపు పనులు ప్రారంభించారు పోలీసులు.. కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు.. కార్యాలయంలోని కంప్యూటర్లును కూడా తరలించారు పోలీసులు.. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. టీడీపీ కార్యాలయంతో పాటు.. గొల్లపూడిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. మరోవైపు టీడీపీ నేతలను కట్టడి చేస్తున్నారు.. మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావును హౌస్‌ అరెస్ట్ చేశారు… ఇక, మొన్న రాత్రి నుంచి టీడీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. అయితే, ఈ నెల 28వ తేదీలోగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని టీడీపీ నేత ఆలూరి చిన్నాకు స్థానిక తహసీల్దారు నోటీసులు ఇచ్చారు.. ఇంకా గడువు పూర్తి కాకముందే.. పోలీసులు చర్యలు చేపడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. పార్టీ కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డుఏర్పాటు చేశారు.. వివాదస్పద స్థలాన్ని.. స్థల యజమానికి అప్పగించామని చెబుతున్నారు పోలీసులు. ఇక, స్థల యజమాని ఆలూరి శేషారత్నం మాట్లాడుతూ.. మా స్థలం వద్ద దేవినేని ఉమ అల్లరి చేయడం తగదన్నారు.. తల్లి కొడుకుల సమస్యలోకి దేవినేని ఉమ ఎందుకు తలదూరుస్తారు..? చంద్రబాబు.. ఉమకు ఇదే నేర్పించారా..? మేమేమైనా పార్టీ కార్యాలయానికి స్థలం రాసిచ్చామా..? అని ప్రశ్నించారు.. పార్టీ కార్యాలయానికి స్థలం రాసిచ్చేంత ఆస్తులు మాకు లేవని.. దేవినేని ఉమలాగా మేం ఆస్తులు సంపాదించుకోలేదని మండిపడ్డారు. తల్లికొడుకుల మధ్య ఉమ వచ్చి తగాదాలు పెడుతున్నారు.. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాం.. నా కొడుకు చిన్నా మంచివాడే.. కానీ, నా కూతురుకేం లేకుండా చేస్తున్నారనేదే నా బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు.. కలెక్టర్ ఆర్డర్ ఇస్తే ఉమకు ఏం ఇబ్బంది..? అని ఫైర్‌ అయిన శేషారత్నం.. దేవినేని ఉమ వల్లే మా కుంటుంబం ఇలా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.. నా ఇంటి ముందు ఉమ ధర్నా చేయడమేంటీ..? ఉమ ఇంటి ముందు నేను ధర్నా చేస్తే ఊరుకుంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post a Comment

Previous Post Next Post