నందమూరి తారక రామారావు 102వ జయంతిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, సారాయి నిషేధం చట్టాలను మరొక్కసారి గుర్తుచేశారు. అదేవిధంగా ఆయన ప్రవేశ పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు నేటికి తెలుగు రాష్ట్రాల్లో కొనసాగటం హర్షణీయమన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా ప్రొహిబిషన్, స్టేషన్ హౌస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అమరావతి, త్రిశూల్ న్యూస్ :

No comments:
Post a Comment