పెన్షన్లు తెచ్చింది మనమే... పెంచింది మనమే - సీఎం చంద్రబాబు - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 27, 2025

పెన్షన్లు తెచ్చింది మనమే... పెంచింది మనమే - సీఎం చంద్రబాబు

- రూ.500 ఉన్న దివ్యాంగుల పెన్షన్లను... రూ.6 వేలు చేశాం

- మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు ఇస్తుంది మనమే

- అర్హులకు న్యాయం జరిగేలా పార్టీ యంత్రాంగం పని చేయాలి

- జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం... రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నాం

- ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
తెలుగు ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీనేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనంత స్థాయిలో పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నాం. సామాజిక భద్రత, వృద్ధాప్య పెన్షన్లును రూ 30 నుంచి రూ. 4000 వరకు మనమే తెచ్చాం. ప్రస్తుతం వృద్ధులకు ఇస్తున్న రూ. 4000 పెన్షన్ మొత్తంలో టీడీపీ ప్రభుత్వాలు రూ. 2875 పెంచాయి. దివ్యాంగులకు గత ప్రభుత్వం రూపాయి కూడా పింఛను పెంచలేదు. వైసీపీ ప్రభుత్వానికి నోరెత్తి మాట్లాడే అర్హత లేదు. దివ్యాంగుల పెన్షన్లను రూ. 500 నుంచి రూ. 6000 చేసింది టీడీపీ ప్రభుత్వాలే. అలాగే డయాలసిస్ రోగులకు రూ. 10 వేలకు పెంచింది టీడీపీనే.. ఇస్తోంది టీడీపీనే. మంచానికే పరిమితమైన వారికి పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టిన టీడీపీ ప్రభుత్వమే.. దాన్ని రూ. 15 వేల వరకు పెంచింది. 63 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా 1వ తేదీనే ఇస్తున్నాం. ఏడాదికి సుమారు రూ.35 వేల కోట్లు పింఛన్లకే ఖర్చు చేస్తున్నాం అని చంద్రబాబు చెప్పారు.

మంచిని చెబుదాం... చెడును తిప్పికొడదాం

“అబద్దాల పునాదుల మీదే వైసీపీ రాజకీయం చేస్తుంది. ఆ పార్టీనే తప్పులు చేస్తుంది... వాటిని ఎదుటివారిపై నెడుతుంది. దీన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనైనా.. గతంలోని ఏ ప్రభుత్వాలైనా ఈ స్థాయిలో పెన్షన్లు ఇచ్చాయా..? ఇవ్వడానికి ఆ ప్రభుత్వాలకు మనస్సు వచ్చిందా..? గత ప్రభుత్వం చాలా మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చింది. దీని వల్ల అర్హులకు నష్టం కలుగుతోంది. ఏ ఒక్క అర్హుడికి నష్టం కలగకూడదంటే అనర్హులను తప్పించాలి. అనర్హులను గుర్తించే ప్రక్రియలో ఎక్కడైనా లోపాలున్నా.. అధికార యంత్రాంగం పొరపాట్లు చేసినా.. దాన్ని గుర్తించి.. సరిదిద్దే బాధ్యతను పార్టీ యంత్రాంగం తీసుకోవాలి. సీఎంగా ప్రభుత్వ విధానాలను అమలు చేస్తాను.. ఏమైనా తేడాలుంటే... పార్టీ అధినేతగా పార్టీ యంత్రాంగం ఇచ్చే ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను. ఆ లోపాలను సరిదిద్దుతాను. అర్హుడైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. పింఛన్ అందిస్తాం. తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్న వారికి నోటీసులతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలని ఆదేశించాం. ప్రతి ఇంటికీ మనం చేసే మంచి పని చేరాలి. ప్రభుత్వం మంచి చేస్తోంది... ఇబ్బందులున్నా సంక్షేమం అందిస్తుందనే విషయం ప్రజలు అర్థం చేసుకునేలా వివరించాలి అని సీఎం సూచించారు. 

సూపర్ సిక్స్... సూపర్ హిట్..!

ఎన్నికలకు ముంద పార్టీ యంత్రాంగం సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించింది. చెప్పిన విధంగా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకన్నాం. ఇదే విధంగా పింఛన్ల విషయంలో కూడా పార్టీ కేడర్ పని చేయాలి. రాజకీయాల్లో ప్రజలకోసం పనిచేయడం ఎంత ముఖ్యమో... చేసిన పనిని చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యం. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం విజయవంతం అయ్యింది. 1.12 కోట్ల ఇళ్లకు పార్టీ యంత్రాంగం చేరింది. ప్రభుత్వం చేసే మంచిని వివరించింది. సెప్టెంబర్ 6వ తేదీన అనంతపురంలో సూపర్-6 సూపర్ హిట్ సభ నిర్వహిస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పినదానికంటే ఎక్కువ చేశాం. ఇచ్చిన మాట ప్రకారం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నిర్వహించాం. ఎంతమంది పిల్లలున్నా.. తల్లికి వందనం ఇచ్చాం. అన్నక్యాంటీన్, అన్నదాత సుఖీభవ అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణసౌకర్యం కల్పించాం. చేనేతలకు ఉచిత విద్యుత్, మత్య్సకారుల సేవలో భాగంగా వేట విరామ సమయంలో రూ.20 వేలు, నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనాలు పెంపు, 40వేలకు పైగా సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రోడ్లపై గుంతలు పూడ్చుతున్నాం. రైతులకు 90 శాతం సబ్సీడీతో డ్రిప్ ఇస్తున్నాం. ఇన్ని మంచిపనులు చేస్తున్నప్పుడు వాటన్నింటిని ప్రజల్లోకి వెళ్లి వివరించాలి. ప్రజలకు ఆమోదయోగ్యమైన పనులు చేస్తున్నాం. ప్రజల సమస్యల పరిష్కారానికి నేతలు చొరవ తీసుకోవాలి. మన దృష్టికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నాం. గతంలో గొడవలు.. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం చేస్తున్నాం అని సీఎం తెలిపారు. 

ప్రజల కోసం రాజకీయం చేయాలి... శాశ్వతంగా నిలవాలి

కార్యకర్తలు, నేతలు గట్టిగా పని చేసి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించారు. ఏ ఎన్నిక వచ్చినా కూటమే గెలవాలి. మనం ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపించి దెబ్బతీయాలని ప్రత్యర్థులు చూస్తున్నారు. వారి కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జిల్లా కమిటీల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తైంది. త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తాం. కొందరు తాత్కాలిక రాజకీయాలు చేయాలనుకుంటారు.. దీని వల్ల ఇబ్బందులు వస్తాయి. శాశ్వత రాజకీయాలు చేయాలి.. అప్పుడు మనం రాణించగలం. పని చేసే నాయకత్వానికి పెద్దపీట వేస్తాం. కార్యకర్తల్లో మరిన్ని నాయకత్వ లక్షణాలు పెంచుతాం. ఆర్థికంగా బలోపేతం చేస్తాం. అని చంద్రబాబు వెల్లడించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages