Trishul News

విద్యార్థులు మంచి వాతావరణంలో విద్యనభ్యశించాలి - జిల్లా కలెక్టర్

చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
నాడు నేడు పనుల ద్వారా విద్యార్థులు మంచి వాతావరణంలో అభ్యశించడానికి వీలవుతుందని అటువంటి పరిస్థితులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ పూతలపట్టు మండలంలోని పి. కొత్తకోట ఉన్నత పాఠశాలలో నాడు- నేడు పనులు మంజూరు కావడంతో పాఠశాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల భవనాలను, ఖాళీ స్థలాలను పరిశీలించారు. గ్రామం ఉన్న వైపు పాఠశాల ఉందని విద్యార్థులు మరోవైపు పాఠశాల నిర్మిస్తే చాలా ఇబ్బందులు పాలు అవుతారని హైవే దాటాల్సిన పరిస్థితి ఉంటుందని జిల్లా కలెక్టర్ అధికారులతో అన్నారు. ఇప్పుడున్న చోటనే అదనపు క్లాస్ రూములు, ఇంకా కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం హైవే వైపు ఉన్న స్థలం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు, తాసిల్దార్ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post