Trishul News

భక్తుల అధిక రద్దీ దృష్ట్యా తిరుమ‌ల యాత్రను వాయిదా వేసుకోవాలి - టిటిడి

తిరుమల, త్రిశూల్ న్యూస్ :
ఆగస్టు 11 నుండి 15 వ తేదీ వ‌ర‌కు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని టీటీడీ అంచనా వేస్తోంది. భ‌క్తులు ప్రణాళిక బ‌ద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమల కు రావాలని టీటీడీ కోరుతోంది. వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీతో పాటు పండుగలతో కూడ వ‌రుస సెలవులు ఆగస్టు 19 వరకు కొనసాగుతాయి. పైగా పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబర్ 18న‌ ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీ ముగుస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో తిరుమ‌ల యాత్రికుల ర‌ద్ధీ అనూహ్యంగా పెరిగే అవ‌కాశం ఉంది.
ఈ కార‌ణంగా వృద్ధులు, చిన్న పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, వికలాంగులు తిరుమ‌లకు పెరటాసి మాసం అనంతరం రావలసిందిగా టీటీడీ విజ్ఞ‌ప్తి చేస్తోంది. అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులను వారి నిర్దేశిత సమయాలలో మాత్రమే దర్శనానికి అనుమతించడం జ‌రుగుతుంది. యాత్రికులు దర్శనం కోసం తమ వంతు వ‌చ్చే వరకు కంపార్ట్‌మెంట్లలో మరియు క్యూ లైన్లలో చాలా గంటలు వేచి ఉండటానికి సంసిద్ధత మరియు ఓపికతో రావాల‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేస్తోంది.

Post a Comment

Previous Post Next Post