Trishul News

సంక్షేమ పథకాలను అర్హులoదరికీ అందజేస్తాం - జిల్లా కలెక్టర్

ఎస్ఆర్ పురం, త్రిశూల్ న్యూస్ :
బుధవారం ఉదయం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo శ్రీరంగరాజపురం (ఎస్ఆర్ పురం) మండలంలో రూ. 50 లక్షలతో చిత్తూరు - పుత్తూరు రోడ్డు నుంచి కమ్మ కండ్రిగ పుల్లూరు క్రాస్ రోడ్డు వరకు మట్టి రోడ్డుగా మార్చిన రోడ్డుకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, జిల్లా కలె క్టర్ యం.హరినారాయణన్ తో కలసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతున్నదని తెలిపారు.1980 సంవత్సరంలో అటవీశాఖ పరిధిలో రోడ్డు ఉన్నట్టు అయితే ప్రస్తుతం ఆ రోడ్డు వేయవచ్చుననే నిబంధనల ప్రకారం అటవీ ప్రాంతంలో రోడ్డు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్ డి ఓ రేణుకా, ఆర్ &బి ఎస్ ఈ దేవానందం, తహసీల్దార్ షబ్బీర్ భాషా, ఎంపీ డి ఓ పార్వతి, సర్పంచ్ భవ్య శ్రీ, ప్రజా ప్రతి నిధులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post