Trishul News

అభివృద్ధి చంద్రబాబు చేస్తే.. గొప్పలు మీరు చెప్పుకుంటున్నారు..!

- ఎమ్మెల్సి భరత్ పై టిడిపి నేతలు ఆగ్రహం

- ఆలయంలో రాజకీయం చేయడం సిగ్గు చేటు

- మీతో చర్చకు లోకేష్ అవసరం లేదు.. మా మాజీ నేతలు చాలు
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు అన్ని అభివృద్ధి చేస్తే.. మీరు మాత్రం మేమే చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని వైసిపిపై మాజీ ఎమ్మెల్సి గౌనివారి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. గురువారం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత ఎమ్మెల్సి భరత్ ఎన్నికల మేనిపెస్టోపై నారా లోకేష్ బాబును చర్చకు రావాలని సవాల్ విసిరారు.. కానీ మీ సవాల్ స్వీకరించి మీకు సమాధానం చెప్పడానికి లోకేష్ రావక్కర్లేదు మా పార్టీ పంచాయతీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు చాలన్నారు. 2014 నుండి 2019 వరకు కుప్పం హంద్రీ నివా కాలువ పనులు 90శాతం పనులు టిడిపి పూర్తి చేస్తే.. మీ ప్రభుత్వం ఈ మూడేళ్ళ కాలంలో ఏమి పురోగతి సాధించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హంద్రీ నివా పూర్తి అయిపోతుందని మీరు.. మీ పెద్దరెడ్డి గొప్పలు చెప్పుకున్నారు. కానీ చేసింది మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. కుప్పం నియోజకవర్గంలోని వన్యకుల క్షత్రియుల మీద మీకు నిజమైన అభిమానం ఉంటే ఇంతవరకు ఎందుకు కమ్యూనిటీ భవనం పనులు పూర్తి చేయలేదు..? మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వళ్లించినట్టు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల మేనిపెస్టోలో పింఛను రూ.3వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికి రూ 2.500 ఇస్తున్నారు. 45ఏళ్లకే పింఛను ఇస్తామని చెప్పినా.. ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రతి గ్రామానికి.. ప్రతి వీధికి టిడిపి హయాంలో రోడ్లు వేస్తే.. వైసిపి ప్రభుత్వం వేసిందని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం టిడిపి ద్వారానే అని తెలిపారు. అక్రమ క్వారీలపై ట్రిబ్యునల్ లో టిడిపి కేసు వేస్తే తప్ప కలెక్టర్ స్థాయి అధికారులు విచారణకు రాలేదని.. వచ్చిన కూడా అక్రమ క్వారీలను టిడిపి వారికి చెందినదని నిందలు వేయడం మానుకోవాలన్నారు. ద్రావిడ విశ్వావిద్యాలయంలోని అక్రమ క్వారీలపై ఎందుకు ఎమ్మెల్సి నోరు మెదపడం లేదని నిలదీశారు. చిత్తూరు ఎమ్మెల్సిగా మీకు అవకాశం ఇచ్చారు.. కుప్పం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి చూపండి.. వివిధ దశలలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాలను పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కుప్పం నియోజకవర్గ ఇంచార్జి పి. ఎస్. మునిరత్నం మాట్లాడుతూ..కుప్పంలో అభివృద్ధి జరగలేదు అనే ఊతపదాన్ని పట్టుకుని సాగదీయడమే వైసిపి నేతల పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. కుప్పం, తమిళనాడు సరిహద్దులో ఉన్న కనక నాచమ్మా దేవాలయాన్ని టిడిపి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే.. వైసిపి నేతలు దేవాలయం వద్ద అన్ని మేము చేసినట్టు బ్యానర్లు కట్టి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. దేవాలయం వద్ద కూడా రాజకీయం బ్యానర్లుతో రచ్చ చేయడం ఒక్క వైసిపి నేతలుకే చెల్లు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తప్ప వైసిపి చేసిన అభివృద్ధి ఏమి లేదని ఈ సందర్బంగా తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ సంబశివం, మాజీ మార్కెట్ కమిటీ చేర్మెన్ సత్యేంద్ర శేఖర్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం కన్వీనర్ శాంతారాం,  రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్, కుప్పం నియోజకవర్గం వర్గ యువత అధ్యక్షులు మణి, నియోజకవర్గం మహిళ అధ్యక్షులు అనసూయ, నేతలు సుబ్బు, ఆర్ ఆర్ రవి, మోహన్, మంజు, రవి, నరేష్, గిరి, రామచంద్ర, హేమంబర్ గౌడు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post