సత్యవేడు, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని జడేరి దళితవాడకు చెందిన మహిళా పాడిరైతు డి.వెంకటేశులు భార్య ద్రాక్షాయిణి(50) మేకలను అడవికి మేతకోసం తీసుకుని వెళ్ళి తిరిగి వస్తుండగా కె.వి కండ్రిగ పొలాల్లో పిడుగుపాటుకు గురై మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. తమ కష్టాన్ని తాము నమ్ముకుని కష్టపడి బ్రతుకుతూ అందరితో కలివిడిగా ఉండే ద్రాక్షాయిణి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిరుపేద మహిళా పాడిరైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags:
ఆంధ్రప్రదేశ్