Trishul News

పరిశ్రమలకు చెందిన 89 క్లైములకు రూ.5.19 కోట్లు ఆమోదం - తిరుపతి కలెక్టర్

- పిఎంఈజిపి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలి

- అధికారులకు తిరుపతి కలెక్టర్ ఆదేశాలు
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనుకూల వాతావరణం ఉన్న విషయాన్ని విస్తృత ప్రచారం కల్పించాలని, పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి). సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఈ ల ఏర్పాటుకు మండల స్థాయిలో జరిగే సమావేశాలలో పరిశ్రమల ప్రాధాన్యతలపై అవగాహన కల్పించాలని పరిశ్రమల శాఖ ఎ.పి.ఐ.ఐ.సి., బ్యాంకర్లు తదితర సంబందిత అధికారులతో అన్నారు. ముందుగా ప్రధాన మంత్రి ఉపాధి కార్యక్రమం (పి.ఎం.ఈ.జి.పి.) క్రింద కే.వి.ఐ.సి.లను సమీక్షిస్తూ లక్ష్య సాధనలో పురోగతి మెరుగుపడాలని మరియు ఎల్.డి.ఎం. వాటికి అనుబంధ బ్యాంకులు లోన్లు ఇచ్చేలా సత్వరమే గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగల్ డెస్క్ విదానంలో జిల్లా ఏర్పడిన నాటి నుండి 422 పరిశ్రమలకు గాను 401అనుమతులు ఇచ్చామని మరో 10 పరిశీలనలో ఉన్నాయని అన్నారు. పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 89 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రూ.5.19 కోట్లు అందించడానికి నేడు ఆమోదం తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 43, విద్యుత్ సబ్సిడీ 18, వడ్డీ రాయితీ 17, ఎస్.జియస్టీ 1, స్టాంప్ డ్యూటీ 1, స్టాంప్ డ్యూటీ 6 పరిశ్రమలు ఇందులో ఉన్నాయని అన్నారు. సి.డి.పి ప్రోగ్రాం క్రింద శ్రీకాళహస్తి, గుంటకిందపల్లి వద్ద కళంకారీ హ్యాండీ క్రాఫ్ట్స్ క్లస్టర్, వేమూరు వద్ద ప్రింటింగ్ క్లస్టర్, వెంకటగిరి వద్ద సారీ ప్రింటింగ్ మరియు డైయింగ్ క్లస్టర్ ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించారు. తొందరోలోనే తిరుపతి జిల్లా నుంచి పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులు అక్టోబర్ నాటికి దాదాపు రూ.9889.60 కోట్లుగా ఉందని వివరించారు. జిల్లాలో పరిశ్రమల ప్రమాదాల నివారణకు కమిటీ చర్యలు చేపట్టిందని, తరచూ తప్పనిసరి సంబందిత అధికారులు సేఫ్టీ మెజర్మెంట్ పై అవగాహన కల్పించి తప్పని సరి అమలు చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణ వివరిస్తూ 84 పరిశ్రమలు తనిఖీలు నిర్వహించి తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పరిశ్రమలకు సంబందించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తిరుపతి, నాయుడుపేట ఏ పి ఐ ఐ సి కి సంబంధించి మొత్తం 3 పరిశ్రమల స్థాపనకు స్థలం కేటాయింపుకు ఆమోదం తెలిపారు. అంతే కాకుండా పరిశ్రమల కాలపరిమితి పెంపు, సేల్ డీడ్, ప్లాట్ సబ్ డివిజన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్ రెడ్డి, జోనల్ మేనేజర్ ఏపిఐఐసి నాయుడుపేట చంద్రశేఖర్, తిరుపతి సుహానా సోని, లీడ్ బ్యాంకు మేనేజర్ సుభాష్, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామ కృష్ణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ రమణయ్య, పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post