Trishul News

సిద్దవటం ఏఎంసి చేర్మెన్ గా దీపం లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం..!

- వైస్ చైర్మన్ గా ముమ్మడి శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ 
సిద్దవటం, త్రిశూల్ న్యూస్ :
కడప జిల్లా సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా దీపం లక్ష్మీదేవి, వైస్ చేర్మెన్ గా ముమ్మడి శ్రీధర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి టి.సుజాత అధ్యక్షతన పాలకవర్గం డైరెక్టర్లుగా భాస్కర్ రెడ్డి, సుభద్రమ్మ, నారపు రెడ్డి యానాదిరెడ్డి, కౌసల్య, ప్రసాద్, అనసూయమ్మ, ధనలక్ష్మి, కృష్ణయ్య, షేక్ బాబ్జి, సావిత్రమ్మ, నరసింహులు, లక్ష్మమ్మ, నాగం మురళీమోహన్ రెడ్డి, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రమాణ స్వీకారం చేశారు. నూతన చైర్పర్సన్ దీపం లక్ష్మీదేవి పాలకవర్గానికి శాలువాతో సత్కరించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం మాకు వచ్చిన నిధులతో రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలతో రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు. రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి, మండల ఇంచార్జ్ మేడా మధుసూదన్ రెడ్డి వీరి సహకారంతో పదవిని కట్ట బెట్టినందుకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. సిద్ధవటం ఒంటిమిట్ట, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కె.వి సుబ్బయ్య, సుబ్బారామి రెడ్డి, ప్రదీప్ మరికొందరు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post