Trishul News

టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం - దార్ల రాజేంద్ర

- వైసీపీ వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారు 

- ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారు

- వైసిపిపై తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర ఫైర్ 
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
నరసరావు పేటలో టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీంను వైసీపీ నేతలు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సూళ్లూరుపేట నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్
ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర పేర్కొన్నారు. మాచర్లలో మొన్నటి విధ్వంసం మరువక ముందే పల్నాడులో మరో ముస్లీం కార్యకర్తను వైసీపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘాంతానికి పాల్పడిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అణుచరుడుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, వైసీపీ ఉన్మాదులను రాష్ట్రం నుంచి ప్రజలు తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీ నేతలు కృూర జంతువుల్లా టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుంటున్న విషయం తెలుగు ప్రజలకు తెలుసన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తూ.. జగన్ రెడ్డికి పుట్టిన రోజు బహుమతిగా మైనారిటీ సోదరుని శవాన్ని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి అందించారని, ఇకనైనా హత్యా రాజకీయాలు అపకపోతే వైసీపీకి మిగిలేది శంకరగిరి మాన్యాలే అన్నారు. ఇబ్రహీం కుటుంబానికి ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, ఇబ్రహీం ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post